రాష్ట్రంలో ఎన్డీ యే కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడిందని కూటమి నేతలు పేర్కొన్నారు. గురువారం కడప జిల్లా, పెద్దతిప్పసముద్రం మండలంలోని రాపూరివాండ్లపల్లెలోని ఉప్పరవాండ్లపల్లె క్రాస్ లో కూటమి నేతలు ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి పవనకళ్యా ణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా గురువారం అమరావతి సచివాలయంలో మొదటి సంతకం మెగా డీఎస్సీ పైల్పై చేసిన సందర్బంగా నాయకులు బారీగా సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో పాలన సుభిక్షంగా ఉంటుందన్నారు. గత ఐదేళ్ల పాలనలో అక్రమకేసులు, వేధింపులు తప్ప అభివృద్ధి లేదన్నారు. కార్యక్రమంలో మావిళ్ల లక్ష్మీనారాయణ, వెంకటరమణరాజు, మాజీ సర్పంచ బండి శంకర్రెడ్డి,పెద్దపాళ్యెం మురళీకృష్ణ, రాష్ట్ర కాపు కార్యదర్శి బలిజ సేన జనసేన కార్యదర్శి ఎ. దేవేంద్ర, సొరకుండ్లయల్లప్ప, బీజేపీ నాయకులు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa