రాబోయే ఐదేళ్లలో ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి సాగునీరు అందిస్తామని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్ఈఆర్) అన్నారు. బుధవారం మండల కేంద్రం లావేరులో ఎచ్చెర్ల నియోజకవర్గ స్థాయి 2024 ఖరీఫ్ వరివిత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 55 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, 37 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. మడ్డువలస కాలువ ద్వారా సాగునీరు తెప్పించి బుడుమూరు నారాయణ సాగర్ను మినీ రిజర్వాయర్గా తీర్చిదిద్దుతానన్నారు. నాగావళి నదీజలాలను తెప్పించి ఎస్ఎం పురం పెద్ద చెరువును రిజర్వాయర్గా తీర్చి దిద్దుతానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa