ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబై అటల్ సేతు బ్రిడ్జిపై పగుళ్లు.. రష్మిక మందనపై ట్రోల్స్

national |  Suryaa Desk  | Published : Fri, Jun 21, 2024, 09:27 PM

దేశంలోనే సముద్రంపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా ముంబైలోని అటల్ సేతు రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో ఈ అటల్ సేతును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. అయితే తాజాగా ఈ అటల్ సేతు బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడ్డాయని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ తెలిపారు. ఆ పగుళ్లకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే గతంలో అటల్ సేతుపై ప్రయాణించి.. కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించిన రష్మిక మందాన్నపై ప్రస్తుతం నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎవరో చేసిన తప్పుకు.. రష్మికను అనడం ఏంటని ఎదురుదాడి చేస్తున్నారు.


మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటోలే ఈ అటల్ సేతును శుక్రవారం సందర్శించారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకే అటల్ సేతుకు బీటలు వారిందని.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు అని విమర్శించారు. దేశంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జి ఎంత నాణ్యతతో నిర్మించారో అర్థం అవుతోందని పేర్కొన్నాయి. అటలు సేతుకు పెద్ద ఎత్తున పగుళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పరిశీలించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.


 దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు హీరోయిన్ రశ్మిక మంధనాను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఎన్నికల సమయంలో దీనిని చూపిస్తూ మోడీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించింది. దీంతో ఈ వీడియోలు పోస్ట్ చేస్తూ.. రశ్మిక మంధనాను ఆడుకుంటున్నారు. రశ్మిక ఇప్పడు కూడా వీడియోలు చేయాలని, వేర్ ఈజ్ రశ్మిక అంటూ కామెంట్లు పెడుతున్నారు.


అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను బీజేపీతోపాటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఖండించింది. ఆ పగుళ్లు వచ్చింది అటల్ సేతుకు కాదని.. దానికి ఉండే అప్రోచ్ రోడ్డుకు అని తెలిపింది. నవీ ముంబైలోని ఉల్వె లింక్ రోడ్డు అని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్పష్టం చేసింది. అటల్ సేతుకు పగుళ్లు ఏర్పడినట్లు వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవాలే అని వెల్లడించింది. ఉల్వె నుంచి ముంబైకి మధ్య అటల్ సేతును కలిపే అప్రోచ్ రోడ్డు అని తెలిపారు. అటల్ సేతుపై చేస్తున్న దుష్ప్రచారం ఆపండి అని బీజేపీ ట్వీట్ చేసింది.


మహారాష్ట్రలోని ముంబైలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి టెక్నాలజీతో అటల్ సేతును నిర్మించింది. రూ.18 వేల కోట్లతో సముద్రంపై 21.8 కిలోమీటర్ల బ్రిడ్జిని నిర్మించింది. ఇది మన దేశంలోనే సముద్రంపై నిర్మించిన అతి పొడవైన బ్రిడ్జిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ అటల్ సేతును ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. అంతేకాకుండా ఈ అటల్ సేతుకు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పేరును కూడా పెట్టారు.


అయితే ఆ సమయంలో ఈ అటల్ సేతు బ్రిడ్జిపై కారులో ప్రయాణించిన రష్మిక మందన.. దాని విశేషాలను వివరిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. బీజేపీ హాయంలో భార‌త‌దేశం రోజురోజుకూ మరింత అభివృద్ధి చెందుతోందని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పొగడ్తల వర్షం కురిపించింది. ఈ అటల్ సేతు అందుబాటులోకి రావడం వల్ల ముంబై నుంచి నవీ ముంబైల మధ్య గతంలో 2 గంటలు పట్టే ప్రయాణం కాస్తా.. 20 నిమిషాలకు తగ్గిందని పేర్కొంది.


రూ.18 వేల కోట్లతో సముద్రంపై 21.8 కిలోమీటర్ల పొడవు, 6 లేన్ల వెడల్పుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రారంభించి 6 నెలలు గడవకముందే పగుళ్లు ఏర్పడటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శలు చేస్తున్నారు. ఆ బ్రిడ్జిపై కారులో ప్రయాణించి.. కేంద్రంపై ప్రశంసలు కురిపించిన రష్మిక మందన.. ఇప్పుడెందుకు స్పందించడం లేదని నెటిజ‌న్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "రష్మిక మందన ఎక్కడ" అంటూ కామెంట్లు పెడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa