ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అనా లెజినోవా, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో కలిసి దిగిన అందమైన ఫొటోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేసిన తర్వాత క్లిక్మనిపించిన ఫొటో ఇదని జనసేన పార్టీ తెలిపింది. ప్రమాణం చేసిన తర్వాత మంగళగిరిలోని నివాసానికి బయల్దేరామనుకుంటే.. ట్రాఫిక్ కారణంగా ఇబ్బందులు తలెత్తాయని, దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపిన జనసేనాని.. కాసేపు సేదతీరారని జనసేన పార్టీ తెలిపింది. ఈ సమయంలోనే భార్య అనా లెజినోవా, పిల్లలు అకీరా, ఆద్యలతో తీసుకున్న ఫొటో ఇది అంటూ అందమైన ఫొటో వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యాన్ని బయటపెట్టింది.
జనసేన పార్టీ ఎక్స్లో పోస్ట్ చేసిన కాసేపటికే ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో పవన్ కుమారుడు ఆద్య సైతం సంప్రదాయ పంచెకట్టులో కనిపించడం విశేషం. రోడ్డు పక్కన చెట్ల నీడ కింద దిగిన ఈ ఫొటోను చూసి జనసైనికులు మురిసిపోతున్నారు. ట్రాఫిక్ ఉందని ఇబ్బంది పడుతూ కార్లోనే కూర్చొనే బదులు.. వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి కాసేపు ఫ్యామిలీతో సేదతీరడం ద్వారా.. ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుందని.. సరిగా చూస్తే ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందని.. ప్రతి ఆటంకాన్ని మన విజయానికి సోపోనాలుగా మార్చుకోవచ్చని చెబుతున్నట్టు ఉంది కదూ.
పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే తన రెండో భార్య రేణు దేశాయ్కు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పిల్లలు అకీరా నందన్, ఆద్య బాధ్యతలను సైతం రేణునే తీసుకున్నారు. అయితే పిల్లలు తరచుగా హైదరాబాద్ వచ్చి తండ్రి దగ్గర సమయం గడుపుతుంటారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయంలోనూ అకీరా పవన్ వెంటే ఉన్నారు. పవన్ దంపతులు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసినప్పుడు అకీరా సైతం వారి వెంట ఉన్నాడు. పవన్ ప్రమాణస్వీకారం సమయంలోనూ వారిద్దరూ వచ్చారు. అకీరా నందన్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa