ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో బుధవారం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఆయన బస చేసిన కుప్పం ఆర్అండ్బి అతిథి గృహము వద్ద ఉదయం 10.30 గంటలకు ప్రజల నుండి వినతుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కుప్పం నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తర్వాత 2.40 గంటలకు పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. సాయంత్రం 4.10 గంటలకు పీఈఎస్ మెడికల్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని, రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు వెళతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa