ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఏపీ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం పలు జిల్లాల కలెక్టర్లను మార్చింది. ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు సాధించేలా అడుగులు వేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పటికే పలుసార్లు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. తాజాగా 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక కడప జిల్లా కలెక్టర్గా శివశంకర్. విశాఖపట్నం కలెక్టర్గా హరేంద్ర ప్రసాద్, పల్నాడు జిల్లా కలెక్టర్గా అరుణ్ బాబులను నియమించారు.
అలాగే అన్నమయ్య జిల్లా కలెక్టర్గా చామకూరి శ్రీధర్, సత్యసాయి జిల్లా కలెక్టర్గా చేతన్, నెల్లూరు కలెక్టర్గా ఆనంద్, అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్గా మహేష్ కుమార్, తిరుపతి జిల్లా కలెక్టర్గా వెంకటేశ్వర్, పార్వతీపురం కలెక్టర్గా శ్యామ్ ప్రసాద్, అనకాపల్లి కలెక్టర్గా కె. విజయ, నంద్యాల కలెక్టర్గా రాజకుమారి, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా స్వప్నిక్ దినకర్లను బదిలీ చేసింది. మరోవైపు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికే పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సోమవారం కూడా ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.
ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్సియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ సీఈవోగా ఉన్న బి. సునీల్ కుమార్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం ఇటీవలే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా నియమించింది. అలాగే ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్సియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ సీఈవోగా వినయ్ చంద్ను నియమించింది. అలాగే.. ఫైనాన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న పీయూష్ కుమార్కు..ప్రణాళికాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవోగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు.
ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పాలనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, రజత్ భార్గవ వంటి అధికారులను బదిలీ చేసింది. సీఎం పేషీలోనూ ప్రక్షాళన దిశగా పలువురు అధికారులను మార్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa