ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద నీటిలో చిక్కుకున్న గేదెలు, కాపాడిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 03, 2024, 02:27 PM

గోదావరి నీటి మట్టం పెరగడంతో స్పిల్‌ చానల్‌పై రోడ్డు మార్గం మంగళవారం నీట మునిగింది. వరద నీటి మధ్యలో నాలుగు గేదెలు చిక్కుకు పోయాయి. పోలవరం ప్రాజెక్టులో 902 హిల్‌ ప్రాంతం నుంచి మహానందీశ్వరస్వామి ఆలయం మీదుగా దిగువ కాఫర్‌ డ్యాంకి మట్టి తరలింపు వాహనాలు రాకపోకలు సాగించడానికి స్పిల్‌ ఛానల్‌పై తూరలతో రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో ఆ మార్గం వరద నీటితో మునిగిపోయింది. ఆ మార్గంలో 4 గేదెలు చిక్కుకుపోయాయి. నలువైపులా నీరు చేరడంతో వరదలో కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలవరం ఎస్‌ఐ పవన్‌ కుమార్‌ పడవలను ఏర్పాటుచేసి గేదెలను ఒడ్డుకు చేర్చే ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa