ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు పి.హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ను కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన పార్టీకి హరిప్రసాద్ ఎంతో విలువైన సేవలు అందించారన్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలు నిస్వార్థమైనవని కొనియాడారు. అంకిత భావంతో పార్టీ కోసం పని చేశారని తెలిపారు. శాసన మండలిలో ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి కోసం బలంగా చర్చించే అవగాహన హరిప్రసాద్కు ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడేటప్పుడు భాషలో కంటే భావంలో వాడి వేడి చూపే నైపుణ్యం కచ్చితంగా ప్రజా ప్రయోజనకరమైన చర్చలకు అవకాశం ఇస్తుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa