పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త, దివ్యాంగుడైన జువ్వాది అశోక్బాబుపై టీడీపీ శ్రేణులు దాడిచేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచి్చంది. తీవ్రంగా గాయపడిన అశోక్బాబు ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తరువాత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ బాలరాంరెడ్డి తెలిపిన మేరకు.. మండలంలోని గణపవరం శాంతినగర్కు చెందిన అశోక్బాబు నూరుశాతం దివ్యాంగుడు. వీల్చైర్కే పరిమితం. ఈ నెల ఒకటో తేదీన పింఛను రూ.6 వేలు టీడీపీ నాయకులు అందించారు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరు మోటార్ సైకిల్పై అశోక్ ఇంటి వద్దకు వచ్చారు. వీల్చైర్లో ఇంటి గుమ్మం వద్ద అశోక్ తలమీద బీరుసీసాతో కొట్టి పరారయ్యారు. తలకు తీవ్రగాయమైన అతడిని స్థానికులు చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న అశోక్బాబు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై జరిగిన దాడి గురించి అశోక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. గతంలో కూడా తనపై రెండుసార్లు దాడి జరిగిందని, ఎన్నికల ఫలితాల రోజు టీడీపీ కార్యకర్తలు తమ ఇంట్లోకి బీరుసీసాలు విసిరేశారని అశోక్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa