ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంతంగా ముగిసిన గిరి ప్రదక్షిణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2024, 10:24 PM

సింహగిరి భక్త జన ప్రవాహంతో పులకించింది. గిరి ప్రదక్షిణ ఉత్సవం ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. శనివారం మధ్యాహ్నం 4 గంటలకు కొండదిగువ తొలిపావంచా నుంచి అప్పన్న పుష్పరథం భక్తుల హరి నామస్మరణల నడుమ బయలుదేరింది. అడివివరం, ముడసర్లోవ, హనుమంతువాక కూడలి, అప్పూఘర్‌, ఇసుకతోట, మద్దిలపాలెం, గురుద్వార, మాధవధార, ఎన్‌ఏడీ, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా రాత్రి 10.30 గంటలకు సింహాచలం చేరుకుంది. భక్తులు ఆదివారం ఉదయం చేరుకోవడంతో ఆరు గంటల నుంచి 10 గంటల వరకు గోశాలకూడలిలో విపరీతమైన రద్దీ నెలకొంది. కాగా గిరి ప్రదక్షిణలో సుమారు 10 లక్షల మంది భక్తులు పాల్గొన్నట్టు అధికారులు అంచనా వేశారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఎక్కువ మంది యువత ఉత్సవంలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తుల్లో కొందరు మెట్లమార్గంలో సింహగిరికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa