ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నిర్వచనం మారిందని..అరాచకం..ఆటవికం..రెడ్బుక్ పాలనగా చంద్రబాబు మార్చారని వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా వైట్ పేపర్ల పేరుతో దుష్ప్రచారం మొదలుపెట్టిందని, ఈ వైట్ పేపర్లు అన్నీ కూడా అబద్ధాలే అన్నారు. రాష్ట్రంలో ప్రజలు బయటకు రాకుండా, ప్రశ్నించకుండా, హత్యా రాజకీయాలు చేస్తున్నాడు. అలా వారిని భయపెడుతున్నాడు. అలాంటి భయానక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. చంద్రబాబుకు ఒక మోడ్ ఆఫ్ ఆపరెండిస్ ఉంటుంది. అది ఒక వంచన. దగా, మోసం అని విమర్శించారు. ఒక మనిషిని అప్రతిష్ట పాల్జేయడం. ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకు అలవాటు అని ధ్వజమెత్తారు. వైట్ పేపర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్రచారాలపై వైయస్ జగన్ దీటైన జవాబు ఇ చ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa