పిఠాపురం అంటే ఇపుడు పొలిటికల్ గా వెరీ ఫ్యామస్ అని చెప్పాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచిన సీటు అది. ఆ మీదట పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా స్థానం అందుకుని కీలక బాధ్యతలు స్వీకరిస్తున్నారు.పిఠాపురాన్ని దేశంలోనే అగ్ర స్థానంలో నిలబెడతామని జనసేన నేతలు ఎన్నికల వేళ చెప్పారు.అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక యాక్షన్ ప్లాన్ ని తయారు చేస్తున్నారు.దాంతో పార్టీ అధినేత సొంత నియోజకవర్గం కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఆయన కూడా ఎంపీగా తన వంతు బాధ్యతను నిర్వహిస్తూ పిఠాపురం మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.జనసేన నుంచి తొలిసారి ఎమ్మెల్సీగా గెలిచి ఆ పార్టీకి శాసనమండలిలో మొదటి ప్రాతినిధ్యం అందించిన పిడుగు హరిప్రసాద్ కూడా జై పిఠాపురం అంటున్నారు. ఆయన పిఠాపురాన్ని దత్తత తీసుకుంటాను అని సంచలన ప్రకటన చేశారు.అలా హరిప్రసాద్ కూడా పిఠాపురాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాను అని చెబుతున్నారు. ఎమ్మెల్సీగా ఆయన తన పరపతిని పలుకుబడిని ఉపయోగించి పిఠాపురం అభివృద్ధికి తన వంతు గా పనిచేస్తాను అని చెప్పడంతో జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం ఎంతో అదృష్టం చేసుకుందని కూడా అంటున్నారు.జనసేన ప్రజా ప్రతినిధులను పార్టీ నేతలను చూసిన వారంతా పిఠాపురం ప్రజలకు మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. మరి రానున్న అయిదేళ్లలో పిఠాపురం ఏ విధంగా అభివృద్ధి సాధిస్తుందో చూడాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa