ఇవాళ ఉదయం నుంచే ఎన్టీఆర్ సామాజిక భరోసా ఫించన్ల పంపిణి కార్యక్రమం ప్రారంభమైంది. తూర్పు గోదావరి జిల్లా... దేవరపల్లి నల్లజర్ల గోపాలపురం మండలాల్లో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఉదయం 5 గంటల నుంచే జిల్లా అంతటా పింఛన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. లబ్ధిదారుల ఇంటి వద్దనే ఎమ్మెల్యేలు, అధికారులు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొత్తూరులో పింఛన్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు. దేవరపల్లి మండలం లో నీ దుద్దుకూరు బందపురం చిన్నాయిగూడెం గ్రామాల్లో అరగంట ఆలస్యంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. ఆలస్యంగా పెన్షన్లు పంపిణీ ప్రారంభించిన సచివాలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, షోకాజ్ నోటీసులు అందజేస్తామని దేవరపల్లి ఎంపీడీవో తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa