భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ఎనలేని ప్రతిభ చూపి, అత్యున్నత స్థాయికి ఎదిగిన ప్రముఖ నృత్య కళాకారిణి పద్మ విభూషణ్ డాక్టర్ యామినీ కృష్ణమూర్తి గారి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో తనదైన శైలితో అద్భుత ప్రతిభ చూపిన యామినీ కృష్ణమూర్తి శాస్త్రీయ నృత్యంలో చెరగని ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు. యామినీ కృష్ణమూర్తి గారి మరణం శాస్త్రీయ నృత్య రంగంలో తీరని లోటని, ఆమె తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం అని తెలిపారు. యామినీ కృష్ణమూర్తి గారి ఆత్మకు శాంతి కలగాలని వైయస్ జగన్ గారు తన సంతాపాన్ని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa