ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని నిర్మాణం కోసం,,,,బంగారు గాజులు ఇచ్చిన మహిళ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 03, 2024, 09:49 PM

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఓ రైతు తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. కంకిపాడుకు చెందిన ఎన్. ప్రభాకర్ రావు అనే రైతు అమరావతి నిర్మాణం కోసం రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి విరాళం అందజేశారు. విజయవాడకు చెందిన జి.వి. మాణిక్యమ్మ అనే మహిళ కూడా రాజధాని నిర్మాణం కోసం బంగారు గాజులు విరాళంగా అందజేశారు. ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబును కలిసి విరాళాలు అందజేశారు.


 సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి చంద్రబాబు ప్రతి శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌ను సందర్శిస్తున్నారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ శనివారం కూడా చంద్రబాబు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌కు వచ్చారు ఈ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు, ప్రజలు చంద్రబాబును కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. అందరి సమస్యలను విన్న సీఎం చంద్రబాబు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే కొంతమంది రాజధాని నిర్మాణానికి, అన్నా క్యాంటీన్ల కోసం తమ విరాళాలను నేరుగా సీఎంకి అందజేశారు.


మరోవైపు రాజధాని అమరావతి కోసం ఇటీవలే అమెరికాలోని మహిళ కూడా విరాళం అందించారు. అమెరికాలోని న్యూజెర్సీలో పనిచేస్తున్న తుమ్మల మధుస్మిత అనే మహిళ నాలుగు రోజుల క్రితం సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి రూ.4 లక్షలు విరాళంగా అందించారు. ఆంధ్రుల రాజధాని నిర్మాణం కోసం తన వంతు సహకారంగా ఈ మొత్తం అందించినట్లు ఆమె చెప్పారు. మరోవైపు రాజధాని నిర్మాణం కోసం విరాళాలు అందిస్తున్న వారిని చంద్రబాబు అభినందించారు. ప్రతి ఒక్కరూ రాజధాని నిర్మాణంలో భాగస్వా్ములు కావాలని పిలుపునిచ్చారు.


ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావటంతో అమరావతి నిర్మాణం పనులు జోరందుకున్నాయి. కేంద్రం నుంచి అమరావతికి ఆర్థిక సాయం ప్రకటన వచ్చిన తర్వాత.. ఈ పనుల్లో మరింత వేగం పెరిగింది. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులను కూడా చేపట్టేందుకు చర్యలు ప్రారంభించారు. అలాగే గతంలో నిర్మించిన భవనాల స్థితిగతులు, నాణ్యతను పరిశీలించేందుకు ఐఐటీ నిపుణుల బృందం కూడా అమరావతిలో పర్యటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa