‘164 అసెంబ్లీ.. 21 ఎంపీలు, 93 స్ర్టైక్ రేట్తో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి. వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి. వారికి న్యాయం చేయాలి’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సోమవారం ఉదయం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పవన్ కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్నీ తట్టుకుని నిలబడ్డామని చెప్పారు. బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చిందన్నారు. అత్యుత్తమ పాలనలో ఒకప్పుడు మోడల్గా ఉన్న రాష్ట్రం, గత ఐదేళ్ల పాలనలో ఎంత దారుణంగా దిగజారిపోయిందో చూశామని గుర్తుచేశారు. పాలన ఎలా ఉండకూడదో గత పాలకులు రాష్ర్టాన్ని మోడల్గా చూపారని పవన్ పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన రాష్ట్రంలో పని చేయడానికి పోటీపడేవారని, మళ్లీ అలాంటి పరిస్థితి తీసుకొద్దామని చెప్పారు. సీఎం చంద్రబాబు అనుభవం, పాలన దక్షతతో రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొద్దామని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa