ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ఎర్రగొండపాలెం సమితి మాజీ అధ్యక్షులు దివంగత వేగినాటి కోటయ్య చేసిన అభివృద్ధి పథకాలు ప్రత్యక్షంగా కన్పిస్తున్నాయని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు. మండలంలోని అమానిగుడిపాడు గ్రామంలో గురువారం అభి వృద్ధి ప్రదాత కోటయ్య విగ్రహన్ని, మండల విద్యాశాఖ మాజీ అధికారి వడ్లమూడి వెంకట సుబ్బయ్య విగ్రహలను ఎరిక్షన్బాబు ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్దాల పాటు సమితి అధ్యక్షులుగా ప్రజలకు కోటయ్య చేసిన సేవలు ఎనలేనివన్నారు. వేగినాటి కోటయ్య సేవలకు గుర్తింపుగా ఎర్రగొండపాలేనికి ఏ ప్రభుత్వం ప్రాజెక్టును మంజూరు చేసినా ఆయన ఏర్పాటు చేస్తా మన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, సీఎం చంద్రబాబునాయుడు ఆశీస్సులతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. జగన్ గత ఐదేళ్లు రాక్షస పాలన చేశాడన్నారు. దీంతో ప్రజలు టీడీపీకి ప్రజలు పట్టంకట్టారని అన్నా రు. వేగినాటి కోటయ్య, వడ్లమూడి వెంకట సుబ్బయ్యల విగ్రహాలను ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కోట య్య తనయుడు వేగినాటి శ్రీనివాస్, వెంకట సుబ్బయ్య కుమారుడు సురేష్, రాష్ట్ర కాకతీయ కమ్మసేవాసమితి కార్యదర్శి బెజవాడ వెంకట్రావు, టీడీపీ మండల అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, మండల టీడీపీ ముఖ్యనాయకులు చిట్యాల వెంగళరెడ్డి, గోళ్ల సుబ్బారావు, కొత్తమాసు సుబ్రహ్మణ్యం, చీదెళ్ల నాగేశ్వరరావు, తోట మహేష్, పాలడుగు వెంకటకోటయ్య, షేక్ ఇస్మాయిల్, జాగర్లమూడి గాలెయ్య, టీడీపీ కార్యకర్తలు, గ్రామప్రజలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa