పార్వతీపురంలో శుక్రవారం ‘మేము సైతం’ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ గురువారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో రక్తకొరత ఉందని, ప్రత్యే కించి ప్రసవాలు, ప్రమాదాల సమయంలో కొన్ని సమయాల్లో చాలా అసౌకర్యానికి గురవుతున్నామని చెప్పారు. మండలంలో రక్తదాన శిబిరాలను సమన్వయం చేసేందుకు మండల స్థాయిలో ఎంపీడీవోలు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని, జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ శోబిక నోడల్ అధికారిగా ఉంటారని చెప్పారు. శుక్రవారం పార్వతీపురంలో, ఈ నెల 12న గుమ్మలక్ష్మీపు రంలో, 26న కురుపాంలో, సెప్టెంబరు 5న పాలకొండలో, 15న సీతంపేట, 28న పాచిపెంట, అక్టోబరు 2న వీరఘట్టం, 12న జియ్యమ్మవలస, 22న సీతానగరం, నవంబరు 2న బలిజిపేట, 14న సాలూరు, 26న భామిని, డిసెంబరు 1న మక్కువ, 10న కొమరాడ, 24న గరుగుబి ల్లిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa