కడప జిల్లా, పెద్దమండ్యం మండలం పరిధి లోని అటవీ ప్రాంతంలో తంబళ్లపల్లి మండలం ఉగవ బోయపల్లికు చెందిన హరినాధ్ కూతురు శ్వేత (17) అనుమానాస్పద స్థితిలో అత్మహత్మ, కేసుపై బుధవారం ములకలచెరువు సీఐ మధు, తంబళ్లపల్లి ఎస్ఐ, పెద్ద మండ్యం ఇనచార్జ్ ఎస్ఐ శివకుమార్ దర్యాప్తు ప్రారం భించారు. మృతురాలు తండ్రి హరినాధ్ను పెద్దమం డ్యం పోలీసు స్టేషనకు పిలిపించి విచారించారు. వీఆర్ వో, వీఆర్ఏలతో పోలీసులు మాట్లాడి విరాలను సేక రించారు. అనంతరం అను మానస్పద స్థితిలో బాలిక మృతి చెందిన సంఘటన స్థలాన్ని, మృతదేహాన్ని దహ నం చేసిన ప్రాంతాన్ని పరిశీలించి దహనం లో మిగిలిన చిన్న చిన్న ఎముకల నమూనాలను సేకరించారు. తం బళపల్ల మండలం ఎగువ బోయపల్లిలో స్థానికులతో అధికారులు మాట్లాడారు. గత నెల 27వ తేది తం బళ్లపల్లి పోలీసు స్టేషనలో శ్వేత తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దాంతో పోలీసులు బాలిక ఆచూకీ కనుగొని ఆమెను తహసీల్దార్ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ నెల 9వ తేదిన ఇంటి నుంచి వెళ్లి పోయి పెద్దమండ్యం మండలం బండ్రేవు సమీపంలో అటవీ ప్రాంతంలో శవమై తేలింది. కేసు దర్యాప్తు సాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa