ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉజ్వల్ పథకం కింద 8 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 01, 2019, 08:37 PM

కేంద్రం ప్రభుత్వం పేద కుటుంబాలకు బడ్జెట్ కానుక అందించింది. ఉజ్వల పథకం కింద 2020 నాటికి 8 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇప్పటిదాకా ఈ పథకం కింద ఆరు కోట్ల కుటుంబాలకు కనెక్షన్లు అందించామని పేర్కొన్నారు. 2016లో ప్రారంభమైన ఈ స్కీమ్‌ ద్వారా తొలిగా 5 కోట్ల కుబుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే 2018 బడ్జెట్ ప్రసంగంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఉజ్వల స్కీమ్‌ను 2021 నాటి కల్లా 8 కోట్ల కుబుంబాలకు చేరువచేస్తామని ప్రకటించారు. జనవరి నెలలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. దేశంలో ఎల్‌పీజీ కవరేజ్ దాదాపు 90 శాతానికి చేరిందని తెలిపారు. 2014లో ఇది 55 శాతంగా ఉందన్నారు. ఉజ్వల స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు అందించే ప్రతి ఉచిత గ్యాస్ కనెక్షన్‌కు ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్‌కు రూ.1,600 సబ్సిడీ రూపంలో అందిస్తోంది. కాగా గ్రామీణ ప్రాంతంలోని పేదరికంలో మగ్గుతున్న గృహిణుల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే గతేడాది డిసెంబర్‌లో ఈ స్కీమ్‌ను అన్ని పేద కుటుంబాలకు విస్తరించింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa