ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలో 6వ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ: పీయుష్

national |  Suryaa Desk  | Published : Fri, Feb 01, 2019, 08:45 PM

కేంద్ర తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పియూష్ గోయెల్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచే 2022 నాటికి కొత్త భారతదేశం దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తమ స్వప్నాలను సాకారం చేసుకునేలా అవకాశాలు కల్పిస్తున్నామ‌ని, గత ఐదేళ్లలో భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింద‌న్నారు. దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న దేశం మనద‌ని, ఇప్పుడు ప్రపంచంలోనే 6వ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అని ఆయన వివరించారు.
ఆర్థిక సంస్కరణలు అమలైన తర్వాత ఏ ప్రభుత్వం సాధించనంత వృద్ధి సాధించామన్నారు. అవినీతి లేని ప్రభుత్వాన్ని  నడిపించామని, పాలనలో పారదర్శకత తీసుకొచ్చామని చెప్పారు. ఉన్నత వర్గాల్లోని పేదల కోసం పది శాతం రిజర్వేషన్లు కల్పించామ‌ని, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాన్ని మూడు రెట్లు పెంచామ‌న్నారు. దేశంలో 2014 నుంచి 2018వ సంవత్సరం వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా 1.53 లక్షల ఇళ్లు నిర్మించామ‌ని, దేశంలో దాదాపు 50 కోట్ల మంది ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టామ‌ని, ప్రపంచంలోనే అత్యంత భారీ ఆరోగ్య పథకం ఈ బడ్జెట్. దీనివల్ల పేద ప్రజలకు రూ.3 వేల కోట్ల సొమ్ము ఆదా అవుతుంద‌న్నారు. దేశంలో 21 ఎయిమ్స్ (ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్) ఉండగా.. 22వ ఎయిమ్స్‌ను హర్యాణాలో ఏర్పాటు చేయనున్నామ‌ని, వీటిలో 14 ఎయిమ్స్‌లను త‌మ‌ హయాంలోనే మొదలు పెట్టామని సగర్వంగా చెప్పారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa