రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఒకవైపు ప్రకటనలు చేస్తూనే, మరోవైపు యథేచ్ఛగా దాడులు చేయిస్తున్నారని, అదే చంద్రబాబు అనైతిక పరిపాలన అని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న ఆయన, సీఎం ప్రోద్భలంతోనే ఆ దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లో ఎండగట్టాలన్న వైయస్ జగన్, వారి దమననీతిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa