ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గూడ్సు రైలు కింద ఏనుగు పడి..

national |  Suryaa Desk  | Published : Sat, Feb 02, 2019, 09:56 AM

ఓడిశా అడవుల్లో వేగంగా వస్తున్న గూడ్సు రైలు కింద ఆడ ఏనుగు పడి మరణించిన ఘటన దెన్ కనాల్ అడవుల్లో బరాదా లెవెల్ క్రాసింగ్ వద్ద జరిగింది. రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఓ ఆడ ఏనుగు రైలు పట్టాలను దాటుతుండగా ఓ గూడ్సు రైలు వేగంగా వచ్చింది. దీంతో రైలు కిందపడి ఏనుగు అక్కడికక్కడే మరణించింది. రైళ్ల వేగపరిమితిపై అటవీశాఖ అధికారుల నుంచి ఎలాంటి ఆంక్షలు లేవని రైల్వే డీఆర్ఎం మోహన్ అగర్వాల్ చెప్పారు. గత ఏడాది నవంబరులో హైటెన్షన్ వైర్లు తగిలి ఓ ఏనుగు మరణించింది. 2009 నుంచి 2017 వరకు విద్యుత్ ఘాతం, రైళ్ల కిందపడి 655 ఏనుగులు మరణించాయని పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa