సామాజిక సమ్మిళితం, సమానత్వ సాధన దిశగా విశాఖపట్నం ఒక గొప్ప ముందడుగు వేసింది. సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్జెండర్లకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అండగా నిలించింది. ట్రాన్స్జెండర్లకు గౌరవప్రదమైన జీవనోపాధిని కల్పించేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ట్రాన్స్జెండర్ల జీవితాలలో మంచి మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో పొరుగు సేవల వ్యవస్థ ద్వారా ట్రాన్స్జెండర్లకు జీవీఎంసీలో పారిశుద్ధ్య కార్మికులుగా నియమించారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 20 మంది ట్రాన్స్జెండర్లకు తాజాగా నియామక పత్రాలను అందజేశారు.
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీలా శ్రీనివాసరావు, విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఈ కార్యక్రమంలో పాల్గొని ట్రాన్స్జెండర్లకు నియామక పత్రాలను అందించారు. ఈ నిర్ణయం ద్వారా ట్రాన్స్జెండర్లకు కేవలం ఉపాధి మాత్రమే కాకుండా, సమాజంలో తలెత్తుకుని బతికే గౌరవం, ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. ట్రాన్స్జెండర్లను కేవలం యాచకులుగా చూడకుండా, వారిని సమాజంలో భాగస్వామ్యం చేయాలనేది ప్రభుత్వ సంకల్పమని జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించినట్లు తెలిపారు.
'గంభీర్ ముందు నువ్వు రంజీ టీమ్కి కోచ్గా చెయ్.. ఆ తర్వాతే టెస్టుకు ఫిట్ అవుతావు '.. ఇంగ్లండ్ మాజీ ఆసక్తికర వ్యాఖ్యలు
మరోవైపు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ట్రాన్స్జెండర్లు నేరాల వైపు మళ్లకుండా సక్రమమైన మార్గంలో రాణించే అవకాశం ఉందని సీపీ శంఖబ్రత బాగ్చీ అభిప్రాయపడ్డారు. మరోవైపు జీవీఎంసీ తీసుకున్న నిర్ణయంపై ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో సమాజం తమను చూసే దృక్పథం మారుతుందని, కష్టపడి పనిచేసి నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో భాగస్వాములవుతామని నియామకపత్రాలు అందుకున్న ట్రాన్స్ జెండర్లు చెప్తున్నారు.
మరోవైపు జీవీఎంసీ ఇలాంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని నివారించేందుకు.. అలాంటి ప్రాంతాలను శుభ్రం చేసి ముగ్గులు పెట్టే కార్యక్రమం కూడా ప్రారంభించింది. దీనికి మంచి స్పందన వస్తూ ఉండటంతో విశాఖ మొత్తం విస్తరించే ఆలోచనలో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa