మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, ఈ విషయం మీ సలహాదారుడు కూడా చెప్పలేదా అని వైయస్ఆర్సీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రులు బలపడాల్సిన సమయంలో వాటిని నిర్వీర్యం చేయడం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటమేనన్నారు. వైయస్ఆర్ కడప జిల్లాలో జరుగుతున్న పరిణామాలు, ప్రజా సమస్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేషన్ డీలర్లు పేదలకు సరిగా బియ్యం పంపిణీ చేయడం లేదని ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్లు ఎంపీ తెలిపారు. పేదలందరికీ రేషన్ బియ్యం అందాలన్నదే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన అని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే 8 వేల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందజేయాలని డిమాండ్ చేశారు. హౌసింగ్ కార్పొరేషన్కు సంబంధించి కోర్టు స్టే వెకెట్ చేయాలని ఏడాది కాలంగా కోరుతున్నా ఎలాంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa