ఏపీ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది.. తెలంగాణ ఖాతా నుంచి ఏపీకి నిధుల్ని జమ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తరఫున చెల్లిస్తూ వచ్చిన అప్పు మొత్తం రూ. 2,547 కోట్ల నిధులను కేంద్రం సర్దుబాటు చేసింది. ఇప్పుడు ఆ నిధులను తెలంగాణ ఖాతా నుంచి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం సర్దుబాటు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విదేశీ ఆర్థిక సాయంతో పథకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన రుణాలను ఆంధ్రప్రదేశ్ చెల్లిస్తోంది.
ఈ ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నా అప్పుల విభజన జరగకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఖాతా నుంచే వాటి చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ నిధులను ఎప్పటి నుంచో సర్దుబాటు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతోంది. గతంలో కూడా ఎన్నో వేదికలపై ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తోంది.. ఈ క్రమంలో కేంద్రం గురువారం రూ. 2,547 కోట్ల నిధులను ఏపీకి సర్దుబాటు చేసింది. అంటే గతంలో తెలంగాణ తరఫున ఏపీ చెల్లించిన అప్పును కేంద్రం తిరిగి జమ చేసింది. ఈ నిధులు ఏపీ ప్రభుత్వానికి కొంత ఊరట అని చెప్పాలి.
మరోవైపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే ఇద్దరు సీఎంలు కలిసే అవకాశం ఉంది.. ఈ నెల 15న శాంతి సరోవర్ 20వ వార్షికోత్సవాల్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు పాల్గొననున్నట్లు సమాచారం. తాజాగా బ్రహ్మకుమారీలు ఆగస్ట్ 25వ తేదీ జరిగే శాంతి సరోవర్ 20వ వార్షికోత్సవానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపనున్నట్లు తెలిసింది. అయితే అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.. ఇద్దరు సీఎంలు జులై నెలలో హైదరాబాద్లో సమావేశమైన సంగతి తెలిసిందే. ప్రధానంగా విభజన సమస్యలపై చర్చించారు.. వీలైనంత త్వరగా ఈ అంశాలను పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. చంద్రబాబు విభజన సమస్యలపై చర్చించేందుకు సమావేశమవుదామని కోరగా.. రేవంత్ రెడ్డి కూడా ఓకే చెప్పగా, హైదరాబాద్లో భేటీ అయ్యారు.
విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. అవసరమైతే భవిష్యత్లో మరికొన్ని సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఇద్దరు సీఎంలు ఎక్కడా కలవలేదు.. అయితే హైదరాబాద్లో జరిగిన ప్రపంచ కమ్మ మహా సభలకు ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరవుతారని ప్రచారం జరిగింది. కానీ ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే హాజరయ్యారు.. చంద్రబాబు దూరంగా ఉన్నారు. తాజాగా శాంతి సరోవర్ కార్యక్రమానికి హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa