రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలను వణికిస్తున్నాయి. గత 2, 3 రోజుల నుంచి కురుస్తున్న ఏకధాటి వర్షానికి నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక జలాశయాలు, ప్రాజెక్టులు నిండిపోవడంతో.. గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇక తెలంగాణలోని ఖమ్మం, హైదరాబాద్.. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రళయాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మనిషి మునిగే లోతులో వరదనీరు చేరింది. సహాయం కోసం వరద బాధితులు.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అమావాస్య కావడంతో.. బెజవాడ వాసుల్లో భయం నెలకొంది. అమావాస్య వేళ.. సముద్రం పోటు మీద ఉండటంతో.. వరద మరింత పెరుగుతుందని వారు తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు.
అమావాస్య కావడంతో ప్రస్తుతం సముద్రం పోటు మీద ఉంది. సముద్రం పోటు మీద ఉంటే పై నుంచి వచ్చే వరద నీటిని సముద్రం అంత త్వరగా తీసుకోలేదు. పైన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద నీటిని మొత్తం సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక పోటు మీద ఉన్న సముద్రం ఆ జలాలన్నింటినీ తనలో వేగంగా కలుపుకోలేకపోతే వరద ప్రభావిత ప్రాంతాల్లోకి మరింత వర్షం నీరు వచ్చే చేసే అవకాశాలు ఉంటాయి. దీంతో అవన్నీ మరింత వరదలో మునిగిపోతాయి. ఇప్పుడు ఇదే భయం విజయవాడ వాసులకు మొదలైంది. ఇక ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటం.. దిగువన సముద్రం పోటు మీద ఉండటంతో ఏం ఆపద ఎటు నుంచి వస్తుందోనని బెజవాడ వాసులు భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు. ఇక సోమవారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాతే.. అమావాస్య గడియలు ముగస్తాయని.. అప్పుడే సముద్రం సాధారణ స్థితికి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఎగువ నుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇక వరద నీరు అనుకున్న ప్రకారం సముద్రంలోకి చేరకుంటే విజయవాడలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బుడమేరు వాగు ఉద్ధృతి కొనసాగుతోంది. ఇక ప్రకాశం బ్యారేజీకి అంతకంతకూ వరద ప్రవాహాం పెరుగుతుండంటంతో.. 11.3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. ఆ వరద సోమవారం సాయంత్రానికి 12 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీలోని అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో లంక గ్రామాలకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు.. కృష్ణలంక ప్రాంతంలో కూడా వరద సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కోతకు గురవుతున్న కృష్ణ కరకట్టను పటిష్ఠం చేసేందుకు స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇసుక బస్తాలతో కరకట్టను బలిష్టం చేసేందుకు స్థానిక యువత పాలుపంచుకుంటున్నారు. మరోవైపు రివర్ ప్రొటెక్టివ్ వాల్ సమీపంలోకి వేల సంఖ్యలో గేదెలు చేరుకుంటున్నాయి. సమీపంలోనీ వరద ప్రభావిత ప్రాంతం నుంచి గేదెలను తీసుకు వచ్చి పునరావాసం ఏర్పాట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa