ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ వరదల్లో బోట్ల వ్యాపారం.. రూ.4000 వరకు వసూలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 02, 2024, 07:40 PM

విజయవాడలో ఒకవైపు వరద ముంచెత్తి, ఉండడానికి చోటు లేక, తినడానికి తిండిలేక ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే.. ఇదే అదునుగా చూసుకుని ఆ కష్టాల్లో ఉన్నవారిని దోచుకుంటున్నారు కొంత మంది ప్రబుద్ధులు. అవకాశం దొరికినప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని భావిస్తున్నారు. నడుము లోతు వరదనీటిలో ఎటు వెళ్లాలో తోచని స్థితిలో ఉన్నవారిని బోట్ల యజమానులు దోచుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నా ఇప్పటికీ చాలా కుటుంబాలు వరద నీటిలోనే ఉన్నాయి. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించడంలో జాప్యం జరుగుతుండటంతో.. కొంత మంది బాధితులు ప్రైవేట్ బోట్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా చూసుకొని బోట్ల యజమానులు రూ. 1500 రూపాయల నుంచి 4000 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క బోటుకు నాలుగు వేలా అని వరద బాధితులు ఆశ్చర్యపోతున్నారు. విజయవాడలో ఇప్పుడు బోట్ల దందా భారీగా సాగుతోంది. తుఫాను ధాటికి విజయవాడ, గుంటూరుతో పాటు రాజధాని అమరావతి ప్రాంతాలు నీటమునిగాయి. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో రాత్రంతా నిద్రలేకుండా జాగారం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa