ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం జగన్ విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం మొదలుపెట్టారు. ఉదయం రిటైనింగ్ వాల్, సాయంత్రం ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ వరద బాధితులను పరామర్శించారు.జగన్తో స్థానికులు తమ బాధల్ని చెప్పుకున్నారు. మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉందని.. వరద నీరు తగ్గడం లేదని బాధితులు జగన్ తో తమ గోడు వెళ్లబోసుకున్నారు.ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం గురించి కూడా జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలు, తక్షణ సాయం కింద ఆహారం, నీరు గురించి ఆరా తీశారు.విజయవాడలో సింగ్ నగర్లో వైఎస్ జగన్ పర్యటించగా.. తమ బాధని జగన్ తో బాధితులు చెప్పుకున్నారు.వరద ప్రభావిత ప్రాంతాల్ని పరిశీలిస్తూ జగన్ ముందుకు సాగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa