రాష్ట్ర రాజకీయాల్లో విలక్షణమైన నాయకుడు, బహుముఖంగా రాజకీయాల్లో రాణించిన వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి. డాక్టర్గా తన జీవన ప్రయాణాన్ని ప్రారంభించి, ప్రజలకు సేవ చేయాలన్న బలమైన, తపన, ఆరాటంతో రాజకీయాల్లోకి వచ్చి, సుదీర్ఘకాలం ప్రజల్లో నిల్చారు అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నేడు అయన మాట్లాడుతూ.... రెండుసార్లు సీఎం అయ్యారు . ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షాన నిల్చారు. అందుకే ఆయన అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనతో కలిసి పని చేయడం నిజంగా నా అదృష్టం. ఎందరికో స్ఫూర్తిప్రదాత అయిన వైయస్ఆర్ బాటలో మనమంతా నడవాలి. ఆయన పోరాట పటిమ స్ఫూర్తిగా ఈ 5 ఏళ్లు మనందరం కలిసి పని చేయాలి అని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa