ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నాను : మంత్రి సత్య కుమార్ యాదవ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 03, 2024, 04:39 PM

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నాను. వైద్యసేవలకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని, వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. బురద, చెత్తాచెదారం పేరుకుపోవడం, కలుషిత నీరు వల్ల జలుబు, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. దీనికి ముందస్తుగా సన్నద్ధం కావాలని, అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని సూచించాను. పిల్లలు, వృద్ధులు, వికలాంగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యాధికారులను ఆదేశించాను. వర్షాలు కాస్త నెమ్మదించినా.. ముంపు ప్రభావం ఉన్నందున ఆరోగ్యం విషయంలో ప్రజలు కూడా తగిన జాగ్రతలు తీసుకోవాలని విజ్క్షప్తి చేస్తున్నాను. పారిశుద్ధ్యం విషయంలో మిగతా శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని వైద్య శాఖ అధికారులను కోరాను.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa