గత 5 ఐదేళ్లలో వైసీపీ పాలకుల తప్పులు, పాపాలకు మనం బాదితులమయ్యామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతిపై దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చెప్పారు. అమరావతిపై విషం చిమ్మడం వైసీపీకి మొదట్నుంచీ అలవాటేనని విమర్శలు చేశారు.రాజధాని అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై దుష్ప్రచారానికి వైసీపీ కుయుక్తులు పన్నుతోందని ఆరోపణలు చేశారు. అమరావతి ముంపు ప్రాంతమనే జగన్ దుష్ప్రచారానికి కొందరు యత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. కొన్ని పేటీఎం బృందాలు, పెయిడ్ ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 11.5 లక్షల క్యూసెక్కులు పోటెత్తినా అమరావతి చెక్కుచెదరలేదని అన్నారు. ప్రకాశం బ్యారేజీకి 4 బోట్లు కొట్టుకురావడం వెనుక వైసీపీ కుట్ర ఉండొచ్చుని అన్నారు. వైసీపీ నేతలు దుర్మార్గం చేయగల ఘనులేనని మంత్రి నిమ్మల రామానాయడు పేర్కొన్నారు. ఇది జగన్ ప్రభుత్వ పాలనా వైఫల్యమని చెప్పారు. బుడమేరును 35 వేల క్యుసిక్లకు పెంచాలని టీడీపీ హయాంలో నిర్ణయించామని తెలిపారు. కేవలం 25 వేల క్యుసిక్ వరద నీరు వస్తే శాంతినగర్ వద్ద 3 చోట్ల బ్రీఛ్ అయ్యిందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa