కృష్ణా జిల్లా నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చుతోంది. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం బుడమేరుకు వచ్చి చేరుకుంటోంది. గత 30 ఏళ్లలో బుడమేరు ఎన్నడూ ఇంతటి ఉధృతంగా ప్రవహించలేదని ముంపు ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. పుట్టగుంటలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వరద నీరు చొచ్చుకు వచ్చింది. అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అరిపిరాలలో అత్యంత ప్రమాద స్థితిలో బుడమేరు ప్రవాహం ఉంది. కట్టకు అడుగు దూరంలో నీరు ప్రవహిస్తోంది. అంతకంతకూ పెరుగుతున్న వరద నీటితో భయాందోళనలో బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు ఉన్నారు. బోట్ల ద్వారా పంపు ప్రాంతాల ప్రజలను అధికారులు ఒడ్డుకు చేరుస్తున్నారు. 3 వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వేలాది ఎకరాల పంట నీట మునిగింది. పలు చోట్ల చేపల చెరువులకు గండ్లు పడ్డాయి. పుట్టగుంట వద్ద బుడమేరు వరద ఉధృతిని కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధరరావు పరిశీలించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాలతో బోట్ల ద్వారా ముంపు బాధిత ప్రజలకు టీడీపీ నేతలు ఆహారాన్ని అందిస్తున్నారు. బుడమేరు నీటి ఉధృతిపై అధికారులతో కలెక్టర్ బాలాజీ సమీక్షించారు. బస్సులు, పడవల ద్వారా ప్రజలంతా పునరావాస కేంద్రాలకు తరలి రావాలని కలెక్టర్ బాలాజీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో ప్రజలందరూ సహకరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa