వరద బాధితులకు నీటి సరఫరా చేసేందుకు పొదిలి మున్సిపాలిటీ నుంచి మంగళవారం 20 మంచినీటి ట్యాంకర్లను పంపించారు. నాలుగు రోజులుగా విజయవాడలో వరద చిక్కుకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు ఆహారం, నీళ్లు అందక ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారాయణ ఆదేశాల మేరకు పొదిలి నుండి 20 నీటి ట్యాంకర్లును మంగళవారం విజమవాడకు పంపించినట్లు ఇన్చార్జ్ కమిషనర్ భూపాల్రెడ్డి, టీడీపీ మండలాధ్యక్షుడు మీగడ ఓబులరెడ్డి తెలిపారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి స్వయంగా మండలంలోని ట్యాంకర్లును సమకూర్చి పంపిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ సిటీలో అవసరమైన ప్రాంతాలకు నీటి సరఫరా చేసేందకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa