విజయవాడ వరద బాధితులకు టీడీపీ నాయకులు చేయూతనిచ్చారు. ముసునూరు పరిధిలోని గోపవరం యువనేత ఉప్పలపాటి గణేష్, కాట్రేనిపాడు యువనేత రాపర్ల మురళీ, నాయకులు రాపర్ల ప్రతాప్, రాపర్ల బాలకృష్ణ సూమారు 15 వేల బిర్యానీ ప్యాకేట్లు, వాటర్ బాటిల్స్ను బుధవారం అంద జేశారు. ముసునూరు సర్పంచ్ కొండేటి విజయలక్ష్మి యిర్మీయా తనయుడు, నియోజకవర్గ తెలుగుయువత కార్యదర్శి కొండేటి ఉదయ్కిరణ్ (బాబి) వరద బాధితుల సహాయార్థం రూ. 10 వేల నగదును సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చారు. అలాగే బీసీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నక్కా యోహాను, ఉప సర్పంచ్ తోట శ్రీనివాసరావు, వార్డు సభ్యుడు రెడ్డి కృష్ణ మరో రూ. 10వేలు విరాళంగా ఇచ్చారు. యువనేత పి.సీతారామ్ 1500 బిర్యానీ ప్యాకెట్లను బాధితులకు పంపీణీ చేశారు. వీరిని మంత్రి పార్థసారథి అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa