ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ జగన్ కొత్త స్ట్రాటజీ.. వైసీపీలో యాంకర్ శ్యామలకు ప్రమోషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 09:36 PM

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో పలువురికి కీలక బాధ్యతలు అప్పగించారు.. పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియమించారు. అలాగే తిరుపతి జిల్లా వైస్సార్‌సీపీ అధ్యక్ష బాధ్యతలను పెద్దిరెడ్డికి అప్పగించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా భూమన కరుణాకర్‌ రెడ్డి, జూపూడి ప్రభాకరరావు, ఆర్‌కే రోజా, యాంకర్ శ్యామలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. యాంకర్ శ్యామల తన భర్తతో కలిసి 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీల ో చేరారు. ఆ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు.. మళ్లీ 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ప్రచారం చేశారు. టీడీపీ, చంద్రబాబు టార్గెట్‌గా శ్యామల చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్యామలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచాయి.


మరోవైపు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయన వైపు కొందరు నేతలు మొగ్గు చూపకపోవడంతో.. వచ్చే వారం నెల్లూరు జిల్లాలోని నేతలందరితో సమావేశమై.. జిల్లా అధ్యక్షుడిని నియమించే అవకాశం వచ్చింది. అలాగే వైఎస్సార్‌సీపీ జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. అనంతపురం జిల్లా అనంత వెంకటరామిరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా ఉషాశ్రీ చరణ్, తూర్పుగోదావరి జిల్లా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రాజమండ్రి నగర అధ్యక్షుడిగా మార్గాని భరత్ రామ్‌‌ని నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.


సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్‌సీపీలో మార్పులు, చేర్పులు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి(చంద్రగిరి), మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డి(పులివెందుల)లను నియమించారు. అలాగే ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును నియమించారు. అంతేకాదు టెక్కలి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్థానంలో పేరాడ తిలక్‌ను నియమించారు. వైఎస్సార్‌సీపీ బీసీ విభాగానికి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమించారు.


వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ఎస్టీ సెల్‌ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మైనారిటీ సెల్‌ అధ్యక్షుడిగా ఖాదర్‌బాషా, పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డిని నియమించారు. మున్సిపల్‌ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్‌, వాలంటీర్‌ విభాగం అధ్యక్షుడిగా నాగార్జునయాదవ్‌, ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా గౌతంరెడ్డి, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడిగా మనోహర్‌రెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉష, ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోచం రెడ్డి సునీల్, వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్‌రాజు, గ్రీవెన్స్‌ విభాగం అధ్యక్షుడిగా నారాయణమూర్తి, టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులుగా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి (ప్రైవేట్‌ స్కూళ్లు), ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి (గవర్నమెంట్‌ స్కూళ్లు)గా నియమించారు. అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను నియమించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa