ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబై నటిపై వేధింపుల కేసులో మరో ట్విస్ట్.. ఇద్దరు పోలీసులు సస్పెండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 09:34 PM

ముంబై నటిపై వేధిపుల కేసు మరో మలుపు తిరిగింది. . ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి.. ఆమెను వేధించిన పోలీసులపై చర్యలు మొదలయ్యాయి. ఆ సమయంలో విజయవాడలో పనిచేసిన ఏసీపీ హనుమంతరావు, అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణలపై వేటుపడింది.. పోలీసు ఉన్నతాధికారులు ఇద్దర్ని సస్పెండ్‌ చేశారు. ఏసీపీ హనుమంతరావును బదిలీల్లో భాగంగా కాకినాడ డీఎస్పీగా పంపగా.. ముంబై నటిని పోలీసులు కస్టడీకి వచ్చిన సమయంలో మళ్లీ విజయవాడ ప్రత్యేకంగా వచ్చారు.


ముంబై నటి ఇంటరాగేషన్‌లో ఏసీపీ హనుమంతరావు కీలక పాత్ర వహించారు.. అలాగే సీఐ సత్యనారాయణ దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన అంశాలను పరిశీలించకుండానే ఉన్నతాధికారులు చెప్పారంని కేసు నమోదు చేసి అరెస్టు చేశారనే అభియోగాలు వచ్చాయి.వీరిద్దరితో పాటుగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులపైనా చర్యలకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.


తనపై ఫోర్జరీ పత్రంతో పాటు తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసి ఇబ్బందిపెట్టారంటూ ముగ్గురు ఐపీఎస్ అధికారులు, వైఎస్సార్‌సీపీ నేతపై కేసు నమోదు చేయాలని ముంబై నంటి ఫిర్యాదు చేశారు. వీరందరు కలిసి తనను వేధించారని ఆరోపించారు.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన తల్లిదండ్రులు, లాయర్లతో కలిసి ఆమె ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో ఫిర్యాదు అందించారు. వైఎస్సార్‌సీపీ నేతతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి.. అప్పటికప్పుడు తనపై కేసు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. వెంటనే తనను, తల్లిదండ్రులను ముంబైలో అరెస్ట్ చేశారన్నారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద కుట్ర ఉందని.. కస్టడీకి తీసుకున్న ఐదు రోజులూ తనతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.


తాను, తన కుటుంబం ఏ తప్పూ చేయకపోయినా 42 రోజులపాటు నరకం అనుభవించిందన్నారు. దీనికి కారణమైన ఐపీఎస్‌లతో పాటు, వైఎస్సార్‌‌సీపీ నేతపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముంబై నటి ఫిర్యాదుపై న్యాయసలహా తీసుకుని.. కేసు నమోదు చేస్తామని ఇబ్రహీంపట్నం సీఐ తెలిపారు. నిబంధనల ప్రకారం తాము ఇబ్రహీపట్నం సీఐకు ఫిర్యాదు చేశామని..తమకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై నమ్మకం ఉందన్నారు నటి తరఫు లాయర్లు.


ముంబై నటిపై వేధింపుల వ్యవహారం కలకంరేపింది. గత ప్రభుత్వ హయాంలో ఇదంతా జరిగిందని బాధితురాలు ఆరోపించారు.. ముంబై నుంచి విజయవాడ వచ్చి పోలీసులు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేకాధికారిగా క్రైమ్స్‌ ఏసీపీ స్రవంతి రాయ్‌ను నియమించారు. నటి కుటుంబ సభ్యులు రెండు రోజుల పాటు ఆమెకు వాంగ్మూలం ఇచ్చారు. ఓ పారిశ్రామికవేత్తకు మేలు చేయడానికి తనపై అక్రమంగా తప్పుడు కేసు బనాయించారని ఆమె ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa