హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగం వచ్చే పదేళ్లలో మరింత విస్తరిస్తుందని నైట్ ఫ్రాంక్ ఇండియా, క్రెడాయ్ నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం 482 బిలియన్ డాలర్లు ఉండగా.. అంది 2034 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అంటే రానున్న రోజుల్లో గృహ నిర్మాణాలకు, ఆఫీసులకు, గెస్ట్ హౌస్లకు మంచి డిమాండ్ ఉంటుందని అర్థమవుతోంది. జనాభా పెరగడం, నగరాలకు వసలు, ఆదాయాలు పెరగడమే ఇందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. సాధారణంగానే మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉంటాయని, ఇల్లు, స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయమని స్థిరాస్తి రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి నుంచే అన్వేషన ప్రారంభిస్తే దసరా నాటికి నచ్చిన ఇల్లు లేదా భూమి కొనొచ్చంటున్నారు.
రియల్ ఎస్టేట్లో కొద్ది మంది మాత్రమే పెట్టుబడి పెడుతుంటారు. చాలా మంది సొంత అవసరాల కోసం కొనుగోలు చేస్తుంటారు. ఇల్లు, విల్లాలు, ఫ్లాట్లు, భవిష్యత్తు కోసం వెంచర్లలో స్థలాలు కొంటారు. ఇవన్నీ దీర్ఘకాలిక అవసరాలు. అందుకే మార్కెట్లతో సంబంధం లేకుండా స్తబ్దుగా ఉన్నప్పుడే కొనుగోలు చేస్తే మంచిదంటున్నారు నిపుణులు. మార్కెట్ స్తబ్దుగా ఉన్నప్పుడు డెవలపర్తో బేరమాడేందుకు అవకాశం లభిస్తుందని, రాత్రికి రాత్రే ధరలు పెంచే పరిస్థితులు ఉండవంటున్నారు. ఇలాంటి మార్కెట్ స్తబ్దుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొనడం ద్వారా కాస్త ధర తగ్గించేందుకు, పేమెంట్లు చేసేందుకు గడువు ఇచ్చేందుకు అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ స్తబ్దుగా ఉందంటే ముందు ముందు ధరలు పెరుగుతాయని అంచనా వేయవచ్చని చెబుతున్నారు. అలాంటి పరిస్థితులు రాకముందే కొనుగోలు చేయాలంటున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిల్లో వచ్చే ఏడాది ప్రారంభం నాటికి గృహ ప్రవేశం చేసేందుకు అందుబాటులోకి వస్తాయి. వీటి ధరలు గత కొంతకాలంగా స్థిరంగానే కొనసాగుతున్నాయి. మార్కెట్ స్తబ్దుగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో కొందరు బిల్డర్లు ఆఫర్లు సైతం ప్రకటిస్తున్నారు. అయితే, కొనే ఇల్లు, స్థలం అనేది చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో లేకుండా చూసుకోవాలి.
అలాగే ఫ్లాట్లు, విల్లాలు మాత్రమే కాకుండా వెంచర్లలోనూ స్థలాలు కొనేందుకు ఇది ఒక మంచి సమయం అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ప్రభుత్వం కొత్తగా మౌలిక వసతులు ఎక్కడ ఏర్పాటు చేయనుంది, భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉన్న స్థలాలు గుర్తిస్తూ నిపుణుల సలహాలు తీసుకుని కొనుగోలు చేయాలి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రభుత్వాలు మారిన సందర్భాల్లో కొంత కాలం పాటు మార్కెట్ అనేది స్తబ్దుగానే ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారిగా పెరిగిన దాఖలాలు ఉన్నాయి. ఈ ధోరణి 2000 సంవత్సరం నుంచి చూడవచ్చు. 2005లో తెలంగాణ ఉద్యమం సమయంలో, కరోనా వచ్చిన సమయంలో మార్కెట్ తగ్గి ఆ తర్వాత ఒక్కసారిగా పుంజుకుంది. ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే వచ్చే 6-12 నెలల్లో బాగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. స్థిరాస్తుల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడే కొనుగోలు చేయండ మేలంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa