తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేటలో వేంచేసియున్న శ్రీ విజయభేతాళ స్వామి వారి ఉత్సవాన్ని వచ్చే నెల16న నిర్వహించనున్నట్లు శ్రీశెట్టిబలిజ అభ్యుదయ సంఘ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటరామరావు, ఉత్సవకమిటీ చైర్మన్ శీలం సత్యఅర్జునరావు తెలిపారు. అంబాజీపేట సంఘ భవనంలో సమావేశం సంఘ కార్యదర్శి మట్టపర్తి రాము అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈసందర్భంగాఅక్టోబరు 3న మాచవరం రామ్ఘాట్ నుంచి శ్రీవిజయభేతాళ స్వామి ఊరేగింపు జరుగుతుందన్నారు. కలశస్థాపనకు 13వాహనాలకు చెందిన కమిటీ సభ్యులకు హాజరుకావాలని కోరారు. ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు ఆయాకమిటీలు బాధ్యత వహించాలన్నారు. సమావేశంలో ఉపాధ్యక్షులు దొమ్మేటి శ్యామ్, బొంతు పెదబాబు, విత్తనాల శేఖర్, దొమ్మేటి సత్యమోహన్, మట్టపర్తి సోమేశ్వరావు, దొమ్మేటి సాయికృష్ణ, గుత్తుల పండు, మట్టపర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని అమ్మవారి ఆలయాలు శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్నాయి. అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa