కనిగిరి నియోజకవర్గంలోని వెలిగండ్లలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నేతృత్వంలో గ్రామ సభ నిర్వహించగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడులో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. నగరంలోని పలు డివిజన్లలో స్థానిక టీడీపీ శ్రేణులు నిర్వహించాయి. దర్శి నియోజకవర్గంలోని వెంకటాపురం, ఇతర గ్రామాల్లో టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నేతృత్వంలో జరిగిన సభల్లో ఎమ్మెల్సీ అశోక్బాబు, మాజీ ఎమ్మెల్యే పాపారావు, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
గిద్దలూరులో జరిగిన కార్యక్రమంలో అక్కడి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి, త్రిపురాంతకం మండలం గొల్లవాండ్లపల్లిలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జి ఎరిక్షన్బాబు పాల్గొన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి నగర పంచాయతీలో టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మన్నం ప్రసాద్ నేతృత్వంలో పెద్దసంఖ్యలో టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని ఇతర పలు ప్రాంతాల్లోనూ ఉత్సాహంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa