ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇళ్ల మీదకు కిరాయి మనుషుల్ని పంపిస్తే భయపడతామా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 11:38 AM

డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇలాంటి రాజకీయాలేంటి? అంటూ పవన్‌ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పవన్‌ చేసిన వ్యాఖ్యలను ఎండగడితే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. గురువారం ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, ఇళ్ల మీదకు కిరాయి మనుషుల్ని పంపిస్తే భయపడతామా?. మీ ఉడత ఊపులకు మేం భయపడబోం’’ అని ధ్వజమెత్తారు. మచిలీపట్నం పోలీసులపైనా పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘సినిమాల్లో నాలుగు డ్యాన్స్‌లు వేసి రాజకీయాల్లోకి వచ్చావ్. నోటికి ఏదొస్తే అది నువ్వు మాట్లాడుతున్నావ్‌. కులం లేదు, మతం లేదంటూ మతాలను  రెచ్చగొడతావ్. క్రిస్టియన్లకు, ముస్లింలకు ఉన్న ఐక్యత మీకు లేదా అంటూ హిందువులను రెచ్చగొడతావ్. ఎన్నికల ముందు కులాలను రెచ్చగొట్టావ్.


ఈ రోజు మతాలను రెచ్చగొడుతున్నావ్. డిప్యూటీ సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి. .బాధ్యత లేకుండా ప్రవర్తించడం సిగ్గుమాలినతనం’’ అంటూ  పేర్ని నాని నిప్పలు చెరిగారు. ‘‘గుడివాడ వెళితే నా కారుపై రాళ్లు వేయించావ్. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అని గుర్తుంచుకో పవన్‌. మచిలీపట్నం పోలీసులను కూడా హెచ్చరిస్తున్నా. తప్పుడు ఉద్యోగం చేయడం మీరు మొదలుపెడితే  హింసా రాజకీయాలు మొదలవుతాయి. మేం చాలా ప్రశాంతంగా ఉన్నాం. మందు పోయించి మా ఇళ్ల పైకి మందిని పంపిస్తే. పరిస్థితులు మరోలా ఉంటాయి’’ అంటూ పేర్ని నాని హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa