ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాఠశాలని తనిఖీ చేసిన డిప్యూటీ డీఈఓ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 11:45 AM

విజయనగరం జిల్లా, బొబ్బిలి  పొట్టి శ్రీరాములు మున్సిపల్‌ హైస్కూల్లో డిప్యూటీ డీఈఓ కె.మోహనరావు గురువారం విచారణ జరిపారు. ఈ పాఠశాలలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పోలీసులకు సమాచారం రావడంతో బుధవారం డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ సతీష్‌కుమార్‌లు పాఠశాలకు వెళ్లి హెచ్చరికలతో కూడిన అవగాహన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి స్పందించారు. డిప్యూటీ డీఈవోను పాఠశాలకు పంపించి సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు.


దీంతో గురువారం డిప్యూటీ డీఈవో మోహనరావు, ఇద్దరు ఎంఈవోలు చల్లా లక్ష్మణరావు, గొట్టాపు వాసులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాఠశాలలో ఎటువంటి అవాంఛనీయ, అనైతిక కార్యకలాపాలు జరిగినట్లు ఫిర్యా దులు వచ్చినా చట్టపరంగా కఠినచర్యలు తప్పవని, బాధ్యులైన వారిని పూర్తిగా డిస్మి స్‌ చేస్తామన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి విడివిడిగా స్టేట్‌మెంట్లు నమో దు చేశారు. హైస్కూల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని వారంతా లిఖిత పూర్వకంగా అధికారులకు తెలియజేశారు. పోక్సో చట్టం అమల్లో ఉన్న దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని, నైతిక విలువలను పరిరక్షించాలని, పాఠశాల ఔన్నత్యాన్ని కాపాడాలని డిప్యూటీ డీఈవో సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa