ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దర్శి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 11:46 AM

పేదరికం లేని రాష్ట్రం కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ పేర్కొన్నారు. దర్శి నగర పంచాయితీలోని క్రిస్టియన్‌పాలెంలో గురువారం సాయంత్రం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర 2047 వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. మంచినీటి వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఆధ్వర్యంలో 2047 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చేసి ప్రథమస్ధానంలో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. వందరోజుల పాలనలో ఎన్నో అద్భుతాలు సాధించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.


గత వైసీపీ అరాచకపాలన నుంచి విముక్తులైన ప్రజలు కూటమి ప్రభుత్వ ప్రజారంజక పాలనలో ఆనంధంతో ఉన్నారని చెప్పారు. దర్శి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి శక్తింవచన లేకుండా కృషి చేస్తామన్నారు. దర్శి నగర పంచాయితీని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకుడు డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, కనిగిరి ఆర్డీవో పాలపర్తి జాన్‌ఇర్విన్‌, తహసీల్దార్‌ ఎం.శ్రావణ్‌కుమార్‌, నగరపంచాయితీచైర్మెన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్‌ చైర్మెన్‌ స్టీవెన్‌, నగర పంచాయితీ కమిషనర్‌ వై.మహేశ్వరరావు, తెలుగు మహిళ నాయకురాలు ఎం.శోభారాణి, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షుడు యాదగిరి వాసు, పట్టణ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ నారపుశెట్టి మధు, ఐటీడీపీ ఇన్‌చార్జ్‌ సందు రామయ్య, బీసీ సెల్‌ నాయకుడు బేళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa