ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డాడు.. నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ మనోడికి ఊహించని పరిస్థితి ఎదురైంది.. బాలిక కుటుంబం సభ్యులు ఇచ్చిన షాక్తో దిమ్మ తిరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం పరిధిలోని ఓ బాలికకు తల్లి లేదు.. అందుకే మేనత్త సంరక్షణలో ఉంటోంది. అయితే సూరంపల్లికి చెందిన గుర్రం శ్రీకాంత్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో బాలిక వెంటపడుతున్నాడు. తరచూ ఆ యువకుడు బాలిక ఇంటికి రావడాన్ని చుట్టుపక్కల వారు గమనిస్తున్నారు.
యువకుడు శ్రీకాంత్ శనివారం రాత్రి బాలిక ఇంటికి వచ్చాడు.. ఆ సమయంలో గమనించిన బంధువులు అతడ్ని పట్టుకుని తాళ్లతో బంధించారు. బాలికను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టగా.. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో యువకుడి తల్లిదండ్రులు నిరాకరించారు. కానీ బాలిక తరఫు బంధువులు మాత్రం ఊరుకోలేదు.. యువకుడు తాళి కట్టాల్సిందేనని పట్టుబట్టారు.. పెద్దల సమక్షంలో యువకుడితో బాలికకు తాళి కట్టించారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు ఇరువర్గాలను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత విజయవాడ కృష్ణలంకకు చెందిన ఐసీడీఎస్ ఉజ్వల హోమ్ ప్రతినిధులు పోలీసుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. వెంటనే ఆ బాలికను హోమ్కు తరలించారు.. ఈ ఘటనపై ప్రస్తుతానికి స్టేషన్లో ఎలాంటి కేసు నమోదు కాలేదు.
కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలో గోవుల్ని అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టురట్టైంది. హనుమాన్జంక్షన్ నుంచి హైదరాబాద్కు లారీలో అక్రమంగా తరలిస్తున్న 50 గోవులను ఎన్టీఆర్జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం దగ్గర పోలీసులు అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మండలంలోని పెనుగొలను దగ్గర అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తుండగా లారీలో ఆవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ లారీని స్వాధీనం చేసుకొని ఆవులను నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలోని గోశాలలో ఉంచామని పోలీసులు తెలిపారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నర్సింగ్ తండాకు చెందిన డ్రైవర్ బాణావత్ రమేష్పై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa