కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో బాధితురాలిపై ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసిన యువతిపై నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె తనపై లైంగిక వేధింపులకు పాల్పడిందని నెల్లూరు పోలీసులకు జానీ మాస్టర్ అల్లుడు షమీర్ ఫిర్యాదు చేశారు.. ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు. తన మామ జానీతో కలిసి హైదరాబాద్, చెన్నైలలో సినిమా షూటింగులకు వెళ్లేవాడినని.. తనను ఆ యువతి లైంగికంగా వేధించిందని షమీర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనపై లిఫ్టులు, షూటింగ్లో విశ్రాంతి తీసుకునే వాహనం, లాడ్జి గదుల్లో ఇలా తనపై లైంగికంగా దాడి చేసిందని ఫిర్యాదులో ప్రస్తావించారు. లాడ్జి గదిలో లైంగికంగా దాడి చేయడంతో పాటు తనను నగ్నంగా ఫోటోలు తీసిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఫోటోలు అందరికీ పంపుతానని బెదిరించిందని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని షమీర్ పోలీసుల్ని కోరారు. అతడి నుంచి ఫిర్యాదు స్వీకరించిన నెల్లూరు పోలీసులు.. కేసు ఇంకా నమోదు చేయలేదు. జానీ మాస్టర్ కేసులో ఈ ట్విస్ట్ సంచలనంగా మారింది.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన దగ్గర అసిస్టెంట్ కొరిగ్రాఫర్గా పనిచేస్తున్న యువతి ఫిర్యాదు చేశారు.. జానీ మాస్టర్ తనను బెదిరించి పలుసార్లు లైంగిక దాడి చేశారని.. ఈ విషయాన్ని బయటపెడితే తనకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించినట్లు ఆరోపించారు. గత నెలలో హైదరాబాద్లో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.. ఆ తర్వాత కోర్టు రిమాండ్ విధించడంతో జైల్లో ఉన్నారు. పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 14న విచారణ జరగనుంది. జానీ మాస్టర్ భార్యపైనా ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. ఆమెను కూడా పోలీసులు ప్రశ్నించారు. అయితే తాజాగా జానీ మాస్టర్ మేనల్లుడు నెల్లూరు పోలీసులకు చేసిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa