కూటమి ప్రభుత్వంలో పల్లెల్లో అభివృద్ధి జాడ మొదలైందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. చెన్నేకొత్తపల్లి, మండలంలోని మేడాపురం గ్రామంలో బుధవారం పల్లెపండుగ వారోత్సవాల్లో భాగంగా రూ.60లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. జడివాన కురుస్తున్న స్థానిక మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లా డుతూ... ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు.
నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.25 కోట్లు నిధులు మంజూరు చేసిందని, ఇప్పటికే అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రజల సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఎంపీడీఓ శివశంకరప్ప, తహసీల్దార్ సురేశకు మార్, పంచాయతీ రాజ్ డీఈఈ లక్ష్మీనారాయణ, జేఈఅబ్దుల్ఖాదర్, ఈఓఆర్డీ అశోక్నాయక్, టీడీపీ నాయకులు ఎల్ నారాయణచౌదరి, కన్వీనర్ ముత్యాల్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబుళేశు, పసల పెద్ద వెంకటరాముడు, లడ్డు లక్ష్మయ్య, సందులో వెంకటేశ, పక్కీరప్ప, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశ, టీడీపీ పంచాయతీ అధ్యక్షుడు జగదీశ, పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa