‘తల్లిదండ్రులు, గురువులకు మాత్రమే పాదాభివందనం చేయాలి. నా కాళ్లకు ఎవరైనా మొక్కితే.. తిరిగి నేనూ అదేవిధంగా చేస్తా’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల పదేపదే చెబుతున్న మాట ఇది. చెప్పినట్లే ఏకంగా ఆయన చేసి చూపించారు. శనివారం రాజధాని అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు వచ్చిన సీఎం చంద్రబాబు కాళ్లకు ఓ వ్యక్తి నమస్కారం చేశారు. అయితే, వెంటనే చంద్రబాబు ‘నన్ను కూడా మీ కాళ్లకు నమస్కారం చేయమంటారా’ అంటూ... కొంచెం ఒంగి ఆ వ్యక్తి కాళ్లు పట్టుకోబోయారు. దాంతో ఆ వ్యక్తి కంగుతిన్నారు. ప్రస్తుతం ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం వద్ద సీఆర్డీఏ భవన ప్రాంగణంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పూజలు నిర్వహించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.160 కోట్లతో 2017లో ఏడంతస్తులు సీఆర్డీఏ ఆఫీసు పనులు చేపట్టారు. కానీ, 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారడం, మూడు రాజధానులు అంశం తెరపైకి రావడంతో పనులు ముందుకుసాగలేదు. మొత్తం 3.62 ఎకరాల్లో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో అమరావతి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో రూ.15 వేలు కోట్లు గ్రాంటు కేటాయించిన విషయం తెలిసిందే. పనులు పునఃప్రారంభించిన అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతమని, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
సీఆర్డీఏ ఆఫీస్ ది బెస్ట్ గా ఉండాలని ఆయన అన్నారు. నడు విజన్ 2020 అని తాను పని చేస్తే, నన్ను 420 అన్నారని, కానీ, నా విజన్ కార్యరూపం దాల్చిందని, ఇప్పుడు విజన్ 2047తో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. తను అలా అన్నవాళ్లే 420లుగా మిగిలిపోయారని పరోక్షంగా మాజీ సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. అమరావతి కోసం సుమారు రూ.13,440 కోట్లు (160 కోట్ల డాలర్లు) ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి కేంద్ర ఆర్థికశాఖ రుణంగా తీసుకుని, సీఆర్డీఏకు అందజేయనుంది. మిగతా రూ.1550 కోట్లు కేంద్రమే ఇవ్వనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa