వైఎస్ జగన్.. షర్మిల, విజయమ్మల సరస్వతీ పవర్ షేర్ల అంశంపై మరోసారి హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో విచారణ జరిగింది. జగన్ దాఖలు చేసిన ఈ పిటిషన్పై విచారణ జరిగింది.. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి విజయమ్మ, షర్మిల తరఫు లాయర్ సమయం కోరారు. దీంతో విచారణను ఎన్సీఎల్టీ డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది. ఇవాళ విచారణ సందర్భంగా.. జగన్ మోహన్ రెడ్డి తరఫు లాయర్ వాదనలు వినిపించగా.. ఇక ప్రతివాదులుగా ఉన్న వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల వాదనలను కూడా కోర్టు వినాల్సి ఉంటుంది.
వైఎస్ జగన్ ఎన్సీఎల్టీలో సరస్వతీ పవర్ కంపెనీలో షేర్ల బదిలీపై ఈ పిటిషన్ వేశారు. తల్లి, సోదరి తనకు తెలియకుండా అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని ప్రస్తావించారు. ఈ పిటిషన్లో విజయమ్మ, షర్మిలతో పాటుగా జనార్దన్రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. సరస్వతి పవర్ కంపెకనీలో షేర్ల బదిలీ ఫారాలు, ఇతర డాక్యుమెంట్లు ఏవీ సమర్పించకుండానే తమ పేర్ల మీదకు మార్చుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. 51.01 శాతం షేర్లను యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని.. జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ పేరిట షేర్లు కొనసాగేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
2019లో సోదరిపై ఉన్న ప్రేమతో ఎంవోయూ రాసుకున్నామన్నారు జగన్. కొంతకాలంగా రాజకీయ విభేదాల కారణంగా.. తనను , తన భార్యను టార్గెట్ చేస్తూ షర్మిల వ్యాఖ్యలు చేసిందని.. అందుకే ప్రస్తుతం 51 శాతంగా ఉన్న ఆమె షేర్లను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నం చేశాను అని ప్రస్తావించారు. అందుకు తరకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఎంవోయూ రాసుకున్న తర్వాత ఎలాంటి సమాచారం లేకుండా షేర్లు ఎలా వెనక్కి తీసుకుంటారని షర్మిల, విజయమ్మలు ప్రశ్నిస్తున్నారు. వీరి తరఫున లాయర్ ఎన్సీఎల్టీలో తమ వాదనల్ని వినిపించాల్సి ఉంది. వైఎస్ జగన్ షర్మిల, విజయమ్మల ఆస్తులు, షేర్లు అంశంపై వివాదం నడుస్తోంది. ఈ మేరకు ఆస్తుల అంశంపై సోషల్ మీడియాలో వార్ నడిచింది. అలాగే షర్మిల - జగన్ మధ్య ఆస్తుల వివాదంపై రాసుకున్న లేఖలు కూడా వైరల్ అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa