సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన కేసుకు సంబంధించి తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. తనపై జరుగుతున్న ప్రచారం నిజం కాదంటూ.. పెట్టిన కేసులపై అనుమానాలు ఉన్నాయని.. తనపై పెట్టిన సెక్షన్స్ ఎలా వర్తిస్తాయో అర్దం కావట్లేదంటూ ఆయన వీడియో విడుదల చేశారు. ఏపీ పోలీసుల నోటీసులకు తాను వణికిపోవడం లేదని, మంచం కింద కూర్చొని ఎడవటం లేదని అన్నారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయ్... తాను పోస్టు ఎవరి ఉద్దేశించి పెట్టానో.. వారికి కాకుండా ఇంకెవరో సంబంధం లేని థర్డ్ పార్టీ వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయనేది తనకు అర్ధం కావట్లేదని అన్నారు.
నాకు నా మనుషులకు ఉన్న అనుమానం ఎంటంటే.. పీడించటానికే ఓ పద్ధతి ప్రకారం అందుబాటులో ఉన్న చట్టాలను వాడుతున్నారా.. ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకొని పాలన చేస్తున్నారు.. అది అమెరికా యూరప్లతో పాటు ఇక్కడా జరుగుతోంది. దీనిపై నేను ఏ ఒక్క పొలిటీషియన్ను, పొలీస్ ఆఫీసర్ను బ్లేమ్ చేయటం లేదు.. కానీ ఈవేలో ఖచ్చితంగా చెయ్యెచ్చు.. చెయ్యాలనే టెంప్టింగ్ ఉండొచ్చు... కానీ చట్టం అనేది ఒకటి ఉంటుంది .. పౌరులకు కట్టుబడి ఉంది కూడా.. నాకొక నోటీస్ వచ్చింది. పలానా తారీఖున వస్తానని రిప్లై ఇచ్చాను.. సినిమా వర్క్ ఉండటం వెళ్లటం అవ్వలేదు. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు మరలా టైమ్ అడిగాను.. ఇదేమి అర్జెంట్ కేసు కాదు. వన్ ఇయర్ బ్యాక్ ట్వీట్ చూసిన వాడికి.. వన్ వీక్ లో అంతా అయిపోవాలని ఎమన్నా ఫీలింగ్ ఉంటుందా.. మర్డర్ కేసులకే సంవత్సరాల సమయం తీసుకుని.. నా కేసులో ఎందుకు అత్యవసరంగా వ్యవహరిస్తున్నారు’’.. అని రాంగోపాల్ వర్మ ప్రశ్నంచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa