ఎకరాకు రూ. కోటి నష్టపరిహారం ఇప్పించాలని టీడీపీ మండల పరిశీలకులు రఘునాథరెడ్డికి ఆ పార్టీ కడప జిల్లా మాజీ కార్యదర్శి ఎద్దుల శేషారెడ్డి, గండి మాజీ చైర్మన రాజారావు, రాజా, కిషోర్ తదితరులు గురువారం వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ చాగలమర్రి-రాయచోటి హైవే రోడ్డు వేంపల్లె పాపాఘ్ని నది పక్కన వేయనున్నారన్నారు. ఇందుకోసం రైతుల నుంచి భూమి తీసుకుంటున్నారన్నారు. దీంతో ఎకరాకు కనీసం రూ.కోటి ఇప్పించాలని వారు కోరారు. ఈ విషయాన్ని టీడీపీ ఇనచార్జి బీటెక్ రవి ద్వారా కలెక్టర్ను కలిసి రైతులకు న్యాయం చేస్తామని ఈ సందర్భం గా వారికి ఆయన హామీ ఇచ్చారు.