ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేము అడిగినంత నష్టపరిహారం చెల్లించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2024, 10:37 PM

ఎకరాకు రూ. కోటి నష్టపరిహారం ఇప్పించాలని టీడీపీ మండల పరిశీలకులు రఘునాథరెడ్డికి ఆ పార్టీ కడప జిల్లా మాజీ కార్యదర్శి ఎద్దుల శేషారెడ్డి, గండి మాజీ చైర్మన రాజారావు, రాజా, కిషోర్‌ తదితరులు గురువారం వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ చాగలమర్రి-రాయచోటి హైవే రోడ్డు వేంపల్లె పాపాఘ్ని నది పక్కన వేయనున్నారన్నారు. ఇందుకోసం రైతుల నుంచి భూమి తీసుకుంటున్నారన్నారు. దీంతో ఎకరాకు కనీసం రూ.కోటి ఇప్పించాలని వారు కోరారు. ఈ విషయాన్ని టీడీపీ ఇనచార్జి బీటెక్‌ రవి ద్వారా కలెక్టర్‌ను కలిసి రైతులకు న్యాయం చేస్తామని ఈ సందర్భం గా వారికి ఆయన హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com